ప్రపంచం - వార్తలు

ఇండియా - వార్తలు

Friday, June 14, 2013

Naxals attack train in Bihar

బీహార్‌లో నక్సల్స్  రైలుపై మెరుపు దాడి
సుమారు 150 మంది సాయుధ నక్సల్స్ గురువారం బీహార్‌లోని నక్సల్స్ ప్రభావిత జిల్లా జముయిలో పాట్నా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కుందర్‌హాల్ట్ వద్దకు చేరుకోగానే పట్టపగలే మెరుపు దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆర్‌పిఎఫ్ జవాను సహా ముగ్గురు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నక్సల్స్ ప్రయాణికులను దోచుకోవడమే కాక ఆర్‌పిఎఫ్ జవాన్లనుంచి ఆయుధాలను సైతం దోచుకుని పారిపోయారు. గురువారం మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల ప్రాంతంలో సుమారు 150 మంది సాయుధ నక్సల్స్ ధన్‌బాద్-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను జముయి, మనన్‌పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కుందన్ హాల్ట్ వద్ద బలవంతంగా ఆపేసి దాదాపు అరగంట సేపు ప్రయాణికులపైన, ఆర్‌పిఎఫ్ జవాన్లపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) ఎస్‌కె భరద్వాజ్ చెప్పారు

No comments:

Post a Comment

వినోదం - వార్తలు

ఆంధ్రప్రదేశ్ - వార్తలు